రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేశ్ ట్వీట్ చేశారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతుల్ని వైఎస్ జగన్ చంపేస్తున్నారని విమర్శించారు. ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతులను ఆందోళనకు గురి చేస్తోందన్నారు.
శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న వారిపై అక్రమ కేసులు పెట్టడంతో.. ఆందోళనకు గురైన అబ్బూరి అప్పారావు అనే రైతు గుండెపోటుతో మరణించారని ట్విట్టర్లో పేర్కొన్నారు. మరో మహిళా రైతు సామ్రాజ్యమ్మ కూడా గుండె పోటుతోనే చనిపోయారన్నారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలచి వేశాయన్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకి ఈ పరిస్థితి రావడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్