telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…

Corona

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,043 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 21 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 4,693 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,56,320 కు చేరగా.. రికవరీ కేసులు 5,13,968 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనా బారినపడి 3,146 మంది మృతి చెందారు.. రికవరీ రేటు దేశంలో 88.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.38 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related posts