telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత్ కోచ్ … ఆగష్టు 15 తరువాతే…

ravisastry invited to be team india coach

భారత ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ మరికాస్త ఆలస్యం కానుంది. వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా, కపిల్ దేవ్ కమిటీ సభ్యులు ఆరుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ దశకు ఎంపిక చేశారు. వీరికి ఆగస్టు 15 తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరందరినీ ఒకేరోజు ఇంటర్వ్యూ చేయాలని కపిల్ కమిటీ నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 13, 14 వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలని తొలుత భావించారు. కొన్ని పత్రాల పరిశీలనకు సమయం పడుతుండడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేశారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ అభీష్టం మేరకు కోచ్ నియామకం ఉంటుందా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. రవిశాస్త్రిని కొనసాగిస్తే తమకు సంతోషం అని కోహ్లీ ఇప్పటికే బహిరంగంగా తన అభిప్రాయం వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కోచ్ ఎంపికలో తాము కెప్టెన్ అభిప్రాయం తీసుకోబోవడం లేదని కపిల్ కమిటీ స్పష్టం చేసింది.

Related posts