telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబల్స్ గెలవటం సిగ్గుచేటు: బీజేపీ నేత లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. శనివారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబల్స్ గెలవటం సిగ్గుచేటు అని అన్నారు. ఏకపక్షంగా మున్సిపాలిటీలను గెలుస్తామన్న కేటీఆర్ ఇప్పుడే సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంట గెలవని కేటీఆర్ రచ్చ గెలవటం కల అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీజేపీ లేనేలేదన్న కేటీఆర్.. గద్వాల, నిజామాబాద్, భైంసా వెళ్లి చూస్తే బీజేపీ ఎక్కడుందో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఎదుర్కొని బీజేపీ నిలిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పుకొచ్చారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో నాలుగు వార్డులు గెలిచామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ భవిష్యత్‌కు నాంది అని పేర్కొన్నారు.

Related posts