telugu navyamedia
సినిమా వార్తలు

రాత్రికి ఎంతిస్తే వస్తావ్…? రష్మీకి షాకిచ్చిన నెటిజన్

Rashmi-Gautham

“జబర్దస్త్” యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు షోలు చేస్తూనే, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కన్పిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో రష్మీ ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ గా ఉంటూ తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా పలు సామజిక అంశాలపైనా రష్మీ స్పందిస్తూ ఉంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారికి టచ్ లో ఉంటుంది. గతంలో చాలా సార్లు తనపై వస్తున్న కామెంట్లపై ఫైర్ అయిన రష్మి తాజాగా మరోసారి తనపై కామెంట్స్ చేసిన నెటిజన్ కి ఘాటుగా బదులిచ్చింది. అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన రష్మికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. కొందరు ఆమెని అసభ్యకరమైన ప్రశ్నలు అడగడంతో ఓ రేంజ్ లో ఫైర్ అయింది. కొందరు పిచ్చి రాతలు రాస్తూ తనకు అసభ్యకర మెసేజీలు పెడుతున్నారని, అయితే తాను మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాను కాబట్టి అలాంటి విషయాలు పట్టించుకోనని చెప్పింది రష్మి. ఆ మెసేజ్ లు తనపై పెద్దగా ప్రభావం కూడా చూపవని చెబుతోంది. అలా మెసేజ్ లు పెట్టే వారి గురించి పట్టించుకోకపోయినా, ఆ మెసేజ్ లు సమాజంలో ఎక్కిస్తున్నారని, అలాంటి పిచ్చికుక్కల వల్లే ప్రస్తుతం అమ్మాయిలూ బాహాటంగా మాట్లాడలేకపోతున్నారని రష్మి అంటోంది. తాను పబ్లిక్ ఫిగర్ ని కాబట్టి తనకు ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని అనుకోవడం పొరపాటని, రెగ్యులర్ గా ఉద్యోగాలు చేస్తోన్న ఎందరో అమ్మాయిలపై ఇలాంటి దాడి జరుగుతుందని చెప్పింది. రాత్రికి ఎంతిస్తే వస్తావ్…? ఎంత డబ్బు కావాలంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారని, అలా అడగడానికి సిగ్గుగా లేదా…? అంటూ మండిపడింది. తన ఒక్కదాని గురించే మాట్లాడడం లేదని, ఇలాంటి బాధలు పడుతోన్న ఎందరో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా అంటూ ఫైర్ అయింది.

Related posts