telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాఫెల్ స్కాంపై పక్కా ఆధారాలు.. మోదీ జైలుకు వెళ్లాల్సిందే: రాహుల్

PM Modi and Rahul tour in Telangana

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డాడు. ఎన్నికల ప్రచార సమయంలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోలో రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాఫెల్ స్కాంపై విచారణ జరుపుతామని అన్నారు. మోదీ తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక రాఫెల్ కుంభకోణంలో మోదీ పాత్రను ఆధారాలతో సహా బయటపెట్టిందని, మోదీ జైలుకు వెళ్లడానికి ఈ ఆధారాలు చాలని రాహుల్ అన్నారు. డసో కంపెనీతో రాఫెల్ విమానాల బేరసారాల కోసం ప్రత్యేక బృందం ఉన్నప్పటికీ, ఆ బృందాన్ని పక్కనబెట్టి మోదీ తానే చర్చలు జరిపిన విషయం వెల్లడైందని అన్నారు. ఈ అవినీతిలో మోదీ పాత్రపై పక్కా ఆధారాలున్నాయని ఉద్ఘాటించారు. మోదీ సర్కారు కేవలం కొద్దిమంది ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందని రాహుల్ ఆరోపించారు.

Related posts