telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్‌కు అనారోగ్యం ..కాసేపట్లో బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యం కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.

గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఎయిమ్స్‌లోనే సీఎం కేసీఆర్ పంటి నొప్పికి చికిత్స తీసుకున్నారు. అయితే మళ్లీ పంటి నొప్పి తీవ్రం కావడంతో కేసీఆర్ ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.

సీఎం కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం సతీమణి శోభ కూడా ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం వారం రోజులకు పైగా ఢిల్లీలోనే ఉన్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.. వారితో భేటీ అయి తెలంగాణ ధాన్యం కొనుగోలుపై చర్చించే చాన్స్ ఉంది.

మరోవైపు, బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా సమావేశం కావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది

Related posts