telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజ్యాంగం ప్రకారమే కార్మిక సంఘాలు: అశ్వత్థామరెడ్డి

ashwathama reddy

రాజ్యాంగం ప్రకారమే కార్మిక సంఘాలు నడుస్తున్నాయని ఆర్టీసీ జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. సెక‌్షన్‌ 19 కింద ఎవరైనా ట్రేడ్‌ యూనియన్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 53 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సహకరించిన రాజకీయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

డిపోల నుంచి అమాయకులను ఏంచుకొని సీఎం మీటింగ్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. అధికారులతో కాకుండా ప్రశాంత వాతావరణం లో ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించాలని కోరారు. రేపు సీఎం నిర్వహించే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని కార్మికులను ఆదుకోవాలని పేర్కొన్నారు.

Related posts