*ఏప్రిల్ 11న కొలువుతీరనున్న ఏపీ కొత్త క్యాబినేట్..
*అదే రోజు (11తేది)న కొత్త మంత్రులు..పాత మంత్రులకు విందు
ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థరించనున్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై గవర్నర్ కు వివరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినేట్ కొలువుదీరనుంది. అదే రోజు కొత్త మంత్రులు..పాత మంత్రులకు విందు ఇవ్వనున్నారు. మంత్రి వర్గంలో ఎవరేవరు అనేది ఒక రోజు ముందుగానే కొత్త మంత్రులకు సమాచారం అందస్తారని సమాచారం.
మంత్రి వర్గ ప్రక్షాళన విషయాన్ని కేబినెట్ భేటీలో మంత్రులకు స్వయగా సీఎం జగనే చెప్పారు. సామజిక కారణాలతో కొంత మందిని తప్ప మిగతా అందర్నీ తొలగించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. దీంతో మంత్రివర్గంలో బెర్త్ కోసం ఎమ్మెల్యేలు చేయని ప్రయత్నాలు లేవు.
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు