telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పార్టీ ముఖ్య నేతలతో ముగిసిన చంద్రబాబు సమావేశం.

తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. చంద్రబాబు తో జరిగే ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన అజెండాపై చంద్రబాబు నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు.

సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు టీడీపీ నేతలు. రాష్ట్రపతి తో పాటు ఇంకా ఎవరెవర్ని కలవాలనే దానిపై నేతలతో ఇవాళ చర్చించారు చంద్రబాబు. టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో రాష్ర్టంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని రాష్ట్రపతితో భేటీలోను చంద్రబాబు కోరనున్నారు .

అయితే టీడీపీ నేతల బృందానికి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమయమిచ్చినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటనలో ఐదుగురు టీడీపీ నేతలు సమయమిచ్చినట్లు స‌మాచారం. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు బృందం కలవనున్నారు.

Related posts