telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోర్టులపై విజయసాయి విమర్శలు

vijayasaireddy ycp

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోర్టులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సభలో కరోనా వైరస్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని చెప్పారు.ఈ క్రమంలో విజయసాయిని రాజ్యసభ డిప్యూడీ ఛైర్మన్ హరివంశ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సబ్జెక్ట్ దాటి మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా విజయసాయి ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతూ పోయారు.

ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి పార్లమెంటులో మాట్లాడటం దారుణమని అన్నారు. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Related posts