telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దాడిపై ప‌ట్టాభి భార్య ఫిర్యాదు..

తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేసిన కేసులో 11 మంది నిందితుల ను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం స‌మ‌యంలో నా భ‌ర్త‌, నేను లేని టైమ్‌లో కొంత‌మంది ఇంటిలోకి వ‌చ్చి వ‌స్తువులు ద్వంసం వెళ్ళిన‌ట్లుగా ఫిర్యాదులో పేర్కొంది.

పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ వేగవంతం చేశామని ఇవాళ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆధారంగా 11 మంది అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆ పదకొండు మంది విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఇంటి చుట్టు ప్రక్కల సిసి కెమెరాల ఆధారంగా పదకొండు మందిని గుర్తించామని.. పట్టాభి ఇంట్లో ఉన్న డివిఆర్ ఇచ్చిన తర్వాత మిగిలిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని సీపీ శ్రీనివాసులు తెలిపారు.

దాడి చేసిన 11 మంది నిందితులు
1. బ‌చ్చు మాధ‌వి కృష్ణ‌..
2. ఇందుప‌ల్లి సుభాషిణి..
3. తుంగం ఝాన్సీ రాణి..
4. బేతాల సునీత‌..
5. య‌ల్లాటి కార్తీక్‌..
6.గొల్ల ప్ర‌భుకుమార్‌..
7. వినుకొండ అవినాష్‌..
8.గూడ‌వ‌ల్లి భార‌తి,
9.దండు నాగ‌మ‌ణి
10 వంకాయ‌ల‌పాటి రాజ్‌కుమార్‌
11 బ‌చ్చ‌ల‌కూరి అశోక్ కుమార్‌

Related posts