ఏపీ టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం సభాహక్కుల నోటీసులు పంపారు. నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు.
స్పీకర్ గౌరవాన్ని భంగపర్చేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందాయి. స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ నోటీసులు అందినట్టు సమాచారం. కాగా, స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా వీళ్లిద్దరూ వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.