కరోనాపై పకడ్బంధీ చర్యలు తీసుకోకపోతే ఆర్ధిక వ్యవస్థకు దెబ్బని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపై సీఎం జగన్ ఒక్కసారి కూడా మీడియా ముందు మాట్లాడలేదని అన్నారు. ఏపీలో కరోనా లేదన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
జగన్ కు ప్రజల కంటే స్థానిక ఎన్నికలే ముఖ్యమని విమర్శించారు. ఎన్నికల వాయిదాతో ఎలక్షన్ కమిషనర్పై తన అక్కసును ముఖ్యమంత్రి వెళ్లగక్కారన్నారు. వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలు, ప్రలోభాల వల్లే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలయ్యాయని యనమల ఆరోపించారు. రీ ఎలక్షన్స్ వస్తాయని వైసీపీకి భయం పట్టుకుందని ఆయన అన్నారు.