telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మాకు ఎన్నికల భయం లేదు..

botsa ycp

ఏపీ నాలుగోవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ… సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేశారన్నారు. అలాగే మాకు ఎన్నికల భయం లేదు.. కరోనా పరిస్థితుల వల్లే వాయిదా వేయాలని అడిగాం అన్నారు.. మాకు ఎన్నికలంటే భయం అని కొందరు ప్రగల్భాలు పలికారు… ఇప్పుడు ఫలితాలు అందరూ చూస్తున్నారు అని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు.. 3,327 పంచాయతీల్లో ఇప్పటి వరకు వచ్చిన నాలుగో విడత ఫలితాల్లో వైసీపీ మద్దతు దారులు 1128 చోట్ల, 88 స్థానాల్లో టీడీపీ మద్దతు దారులు విజయం సాధించారన్న బొత్స.. ఈ ఫలితాలతో మా ప్రభుత్వం బాధ్యత ఇంకా పెరిగిందన్నారు.. చంద్రబాబు కింద పడినా నేనే పైనునన్నాను అని చెప్పుకుంటున్నారని మండిపడ్డ ఆయన.. 2019లో ప్రజలు టీడీపీని ఛీ కొట్టారు… ఇప్పుడు కూడా అవే ఫలితాలు ఇచ్చారన్నారు.. టీవీల్లో గ్రాఫిక్స్ చూపించే కాలం అయిపోయింది.. ప్రజలు చైతన్యవంతులు అయ్యారు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. మరి దీనికి ఎవరు సమాధానం ఇస్తారు అనేది చూడాలి.

Related posts