మద్రాసుకు తాగునీటి కోసం తెలుగుగంగకు 9 టీఎంసీలిచ్చి ఆపేయమని కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. భారీ వర్షాలతో డ్యాంలు నిండుతున్నప్పటికీ పోతిరెడ్డిపాడుకు మాత్రం నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమనివిమర్శించారు.
కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం డ్యాంలోకి వరద పోటెత్తుతున్నా పోతిరెడ్డిపాడుకు మాత్రం నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమని సోమిరెడ్డి ట్వీట్ చేశారు. వెనుకబడిన రాయలసీమలో సాగు, తాగునీటి ఆవశ్యకతను కృష్ణా బోర్డుకు వివరించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వెంటనే పోతిరెడ్డిపాడుకు పూర్తి స్థాయిలో నీళ్లు విడుదల చేయాలని సోమిరెడ్డి పేర్కొన్నారు.
అమరావతిలో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చు: ఎమ్మెల్యే గంటా