గవర్నర్ వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.రాష్ట్రానికి రాజ్యాంగ అధినేత గవర్నర్ కోవిడ్పై ఆందోళన వ్యక్తం చేశారనిపేర్కొన్నారు. కరోనా నియంత్రణపై ప్రభుత్వం సరిగా స్పందించలేదని చెప్పారన్నారు. వైద్య సిబ్బందిని పెంచాలని, బెడ్లను పెంచాలని సీఎంను కోరారన్నారు.
బుద్దిలేని ప్రభుత్వం గవర్నర్పై ఎదురుదాడి చేస్తోందని భట్టి పేర్కొన్నారు. సీఎం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. గవర్నర్ ఇక్కడితో వదిలేయొద్దని, ప్రభుత్వాన్ని గాడిన పెట్టాలని కోరారు. గవర్నర్ పై అడ్డగోలుగా మాట్లాడిన టీఆర్ఎస్ నేతల తీరును ఖండిస్తున్నామన్నారు. గవర్నర్కు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.