telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వాన్ని ఎండగడితే కేసులు పెడుతారా: లోకేశ్

ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వం లో ఉన్న లోపాల గురించి టీడీపీ కార్యకర్త కార్తీక్ గరికపాటి ఎండగడితే కేసులు పెడుతారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ప్రజల గొంతు నొక్కాలని చూస్తే అది విప్లవానికి నాంది పలుకుతుందని సీఎం జగన్ ను హెచ్చరించారు.

ఒక ససామాన్యపౌరుడు అయిన కార్తీక్ జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే అతన్ని వేధింపులకు గురి చేస్తారా? అని ప్రశ్నించారు. కార్తీక్ కు తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు. అతనికి అన్నివిధాల సాయం అందించే బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని లోకేశ్ ఈ సందర్భంగా ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts