ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో సున్నా వడ్డీని రూ.3 లక్షల పంట రుణాలకు కూడా అమలు చేశామని అన్నారు. కానీ ఇప్పుడు అదే సున్నా వడ్డీని లక్ష లోపు పంట రుణానికి పరిమితం చేశారని మండిపడ్డారు. ఇది రైతులను దగా చేయడం కాదా అని జగన్ ను నిలదీశారు.
ఎన్నికల ముందు రైతులకు వడ్డీలేని పంట రుణాలు ఇస్తామని చెప్పారు. గత ఏడాది తీసుకున్న రూ.76 వేల కోట్ల పంట రుణాలకు రైతుల ఖాతాల్లో ఎంత జమ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సున్నా వడ్డీ కిరికిరి… రైతులకు లక్ష వరకే రాయితీ అంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఉమ పంచుకున్నారు.
కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం కాలేడు: లక్ష్మణ్