telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : రాయల్స్ ను గట్టెక్కించిన మోరిస్…

ముంబై వేదికగా ఐపీఎల్2021 లో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ తీసుకోవడంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. అయితే వచ్చి రాగానే ఢిల్లీ జట్టుకు రాయల్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ షాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కష్టాల్లో పడిపోయిన ఢిల్లీని ఆ జట్టు కెప్టెన్ పంత్(51) అర్ధశతకంతో ఆదుకోవడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇక 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాయల్స్ కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. మొదట జట్టు ఓపెనర్లు ఇద్దరు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరగా ఆ తర్వాత ఓవర్లోనే కెప్టెన్ సంజు కూడా ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ మిల్లర్(62) అర్ధశతకంతో రాణించాడు. మరోవైపు ఆటగాళ్లు అందరూ పెవిలియన్ కు లైన్ కట్టిన మిల్లర్ మాత్రం జాగ్రత్తగా ఆడుతూ అర్ధశతకం పూర్తి చేసిన తర్వాత వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ మోరిస్ జట్టుకు పని పూర్తి చేసాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 27 పరుగులు అవసరం ఉండగా నాలుగు సిక్స్ లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ కు ఇదే మొదటి విజయం. ఇక చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts