telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీల పోరాటం అభినందనీయం: చంద్రబాబు

tdp chandrababu

తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల పోరాటం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. వైసీపీ మంత్రుల దాడులను తట్టుకుని ఎమ్మెల్సీలు పోరాటం సాగించడం అభినందనీయం అన్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి అంశాలను లెక్కచేయకుండా తమ ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరయ్యారని ప్రశంసించారు. ఇదే పోరాట స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రలోభాలకు లొంగిన కొందరు చరిత్రహీనులయ్యారని అన్నారు. ఉన్మాదిపై పోరాటంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలి సమావేశాల గురించి మాట్లాడుతూ, సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ తెచ్చారని, రూల్ 90 కింద చర్చించాలని కోరితే దాడులకు దిగారని మండిపడ్డారు.

Related posts