ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొన్నటి ఎన్నికల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ప్రజావేదికలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు తమ విజయానికి కీలకం కానున్నాయని అన్నారు. నివేదికలు, సర్వేలు టీడీపీకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
ప్రతిపక్షాలు ‘మైండ్ గేమ్’ ఆడుతున్నాయని విమర్శించారు. ఏపీని ఇంత అభివృద్ధి చేశాక ఓటు వేయకపోతే రాజకీయాలకు అర్థం లేదన్నారు. అభివృద్ధి పనులను అందరూ పట్టించుకుంటే విజయం ఒక వైపే ఉంటుందన్నారు.తాత్కాలిక ప్రలోభాలకు ఆశ పడితే శాశ్వత అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు.
అమరావతికి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ : బొత్స