తెలంగాణలో నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి పీఠంపై కూర్చోవాలంటూ రాజశ్యామల మహా యాగం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగుల రాకేశ్ రెడ్డి వరంగల్ జిల్లా హన్మకొండలోని విష్ణు గార్డెన్స్ లో శనివారం ఈ యాగం చేపట్టారు. వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన రాజశ్యామల యాగానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 300కి పైగా స్థానాల్లో గెలుపు తథ్యమని, మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని లక్ష్మణ్ అన్నారు. ఆయనకు భగవంతుడి దీవెనలు మెండుగా ఉన్నాయని తెలిపారు. జనరంజక పాలన అందిస్తున్న మోదీనే మళ్లీ ప్రధాని కావాలన్నది భారత ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. భారతదేశం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలన్నా, శత్రుదేశాల నుంచి రక్షణ ఉండాలన్నా బీజేపీనే అధికారంలోకి రావాలని అన్నారు.
వ్యవస్థ మారనంత కాలం రాజకీయ పెత్తనం: ప్రొఫెసర్ నాగేశ్వర్