telugu navyamedia
రాజకీయ వార్తలు

కేం‍ద్ర బలగాలకు అలా చెప్పే హక్కు లేదు: మమతా బెనర్జీ

BJP compliant EC West Bengal

బెంగాల్‌ ముఖ్యమం‍త్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ ఆపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయాలని కేం‍ద్ర బలగాలు ఓటర్లను కోరుతున్నాయని ఆమె దుయ్యబట్టారు. మాల్ధాహదక్షిణ్‌ నియోజకవర్గంలోని ఇంగ్లీష్‌బజార్‌ ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలు తిష్టవేసి బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. వారికి అలా చెప్పే హక్కు లేదని, దీనిపై తమ అభ్యంతరాలను ఈసీకి నివేదించామని వెల్లడించారు.

కేంద్ర బలగాలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. 2016లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే తీరున వ్యవహరించిందని దుయ్యబట్టారు. బెంగాల్‌ ప్రజలు బీజేపీకి దీటుగా బదులిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలకు పనేముందని ఆమె ప్రశ్నించారు

Related posts