టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతారని తాము ముందే అంచనా వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంపై హైకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
చంద్రబాబు కుట్రలు అన్నింటినీ అధికారంలోకి రాక ముందే మేము ఊహించాం. ఆయన ఏ విధంగా వ్యవస్థలని మేనేజ్ చెయ్యగలడో అందరికీ తెలుసు. వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’ అని పేర్ని నాని ట్వీట్ చేశారు.
మన్కడింగ్ పై హర్షా భోగ్లే కీలక వ్యాఖ్యలు…