telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నామినేషన్ల గడువు పెంచాలి..ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ

chandrababu

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని కమిషనర్‌ ను కోరారు. తమ నేతలకు రాష్ట్ర రిటర్నింగ్‌ అధికారులు సకాలంలో నో డ్యూ, కుల ధ్రువీకరణ పత్రాలు అందచేయలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అధికారులు అందుబాటులో లేని కారణంగా వాటిని ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు.

నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని, ఇందుకు కొందరు పోలీసులు కూడా సహకరించారని ఆయన ఆరోపించారు.చాలా మంది అభ్యర్థులు సకాలంలో నామినేషన్లు చేయలేకపోయారని, దాదాపు 76 ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలను జతచేసి చంద్రబాబు లేఖ రాశారు.

Related posts