వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. విధ్వంసంతో పాలనను ప్రారంభించిన సీఎం జగన్ రాష్ట్ర వంచించారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తానని చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జనాల నెత్తిన నవరత్న తైలం రాశారని విమర్శించారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటానని చెప్పారని.. కానీ, రాష్ట్రాన్ని ముంచేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
మరో రెండు టర్మ్లు నేనే సీఎంగా ఉంటా.. అసెంబ్లీలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు