telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ !

కాంగ్రెస్‌ యువనాయకురాలు ప్రియాంక గాంధీతో తెలంగాణ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనారెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. తెలంగాణలో పర్యటించాలని ప్రియాంక గాంధీకి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయాలని, ఆ బాధ్యత యూత్ పై ఉందని చెప్పారు ప్రియాంక. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉత్తర్ ప్రదేశ్ ఇంచార్జిగా ప్రియాంక గాంధీ వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తామని, తప్పక రావాలని ప్రియాంక గాంధీని ఆహ్వానించారు శివసేనారెడ్డి. సమయం చూసుకుని తప్పకుండా తెలంగాణకు వస్తానని హామీ ఇచ్చారు ప్రియాంక గాంధీ.

Related posts