telugu navyamedia
రాజకీయ వార్తలు

శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ లో ఐదుగురికి చోటు!

Shivraj-Singh-Chouhan

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన క్యాబినెట్ లో ఐదుగురికి స్థానం కల్పించారు. నరోత్తమ్ మిశ్రా, గోవింద్ సింగ్ రాజ్ పుత్, మీనా సింగ్, కమల్ పటేల్, తులసీరామ్ సిలావత్ మంత్రులుగా చాన్స్ దక్కించుకున్నారు. మార్చి 23న సీఎం గా పదవీ ప్రమాణం చేసినప్పటి నుంచి క్యాబినెట్ లో అన్నీ తానై శివరాజ్ వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు క్యాబినెట్ లో మంత్రులెవరూ లేకుండానే పాలన కొనసాగించారు.

కరోనా విస్తరిస్తున్న తరుణంలోనూ అంతా తానై నెట్టుకొచ్చారు. అయితే పరిస్థితి మరీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరించారు. కరోనా విజృంభిస్తుంటే మంత్రులను ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ కాంగ్రెస్ అదేపనిగా విమర్శిస్తుండడంతో సీఎం శివరాజ్ సింగ్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఐదుగురు మంత్రులు పదవీప్రమాణం చేశారు.

Related posts