telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

టెన్త్ విద్యార్థిని రేప్…కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు

యూపీలోని మీరట్‌లో ఓ కామాంధుడు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న బాలికను అత్యాచారం చేసి.. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరిని మీరట్‌ పోలీసులు కాల్చాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను కోర్టుకు తీసుకుని వెళుతుండగా.. వారిలో ఒకరు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిపై ఫైరింగ్‌ చేశారు. ఈ ఘటనలో అతనికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ కేసులో టెన్త్‌ విద్యార్ధినిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత యువతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు నిందితుల పేర్లను వెల్లడిస్తూ సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి చనిపోయింది. ఆ లేఖ ఆధారంగా నిందితులను అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.

Related posts