telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇకపై వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదు: చంద్రబాబు

chandrababu gift on may day

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ద్వజమెత్తారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు ఆగడాలు పెచ్చుమీరాయని మండిపడ్డారు. ఇకపై వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదని, వారి అరాచకాలను అడ్డుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. మీడియాను సైతం వైసీపీ వదిలిపెట్టడం లేదన్నారు. నెల్లూరులో ఓ రిపోర్టర్‌ను వైసీపీ ఎమ్మెల్యే చంపుతానని బెదిరించారని అన్నారు. విశాఖపట్నంలోనూ రిపోర్టర్లపై దాడులు చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టు సంఘాలు సపోర్ట్ చేయొద్దని బెదిరించారని అన్నారు. వైసీపీ నేతల దాడులను ప్రజాసంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు.

Related posts