వైసీపీ ప్రభుత్వం పై మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలేస్తున్నా వైసీపీ నేతల్లో మార్పు రాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏబీఎన్ ప్రసారాల నిలుపుదలను ఖండించారు. జగన్ సర్కారు అబద్ధాలు చెబుతోందని, ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఏబీఎన్ ప్రసారాల నిలుపుదలపై టీడీశాట్ విచారణలో సాంకేతిక కారణాలంటూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? కోర్టుల ముందు ఒకలా, పాలనలో మరోలా ప్రభుత్వం ఎందుకుంటోందని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మారాలని ఆయన వ్యాఖ్యానించారు.