తమిళనాడులో కరోనా వైరస్ అన్ని రంగాల వారిని టచ్ చేస్తోంది. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. రాష్ట్రంలో ప్రతిరోజు పెద్దసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు పోలీస్ డిపార్టుమెంట్లో కూడా కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్నది.
తాజాగా తిరుచులి పోలీస్స్టేషన్లో కూడా ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆ పోలీస్స్టేషన్ను పూర్తిగా మూసివేసినట్టు మిళనాడు పోలీస్శాఖ వెల్లడించింది. కరోనా బారినపడ్డ పోలీసులను ఆస్పత్రికి తరలించి కరోనా చికిత్స అందిస్తున్నారు. వారితో కలిసి పనిచేసిన మిగతా పోలీసులను హోమ్ క్వారెంటైన్ కు తరలించారు.
మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ: కుటుంబ రావు