telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిఖిల్ 20వ సినిమా… భారీ బడ్జెట్ తో…!

nikhil

‘అర్జున్ సుర‌వ‌రం’తో ఇటీవలే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో నిఖిల్… లాక్ డౌన్ సమయంలో పెళ్లితో ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఇప్పుడు నిఖిల్ తన 20వ సినిమాను ప్రకటించాడు. ఇందుకు సంబంధించి అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశాడు నిఖిల్. ఈ సినిమాని శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) బ్యాన‌ర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా నిర్మించ‌నుండ‌గా, సోనాలీ నారంగ్ స‌మ‌ర్పించ‌నున్నారు. ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను రెయిన్‌బో రీల్స్ చూసుకోబోతున్న‌ట్లు ట్వీట్‌లో పేర్కొన్నాడు నిఖిల్. ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి ప‌నిచేసే ద‌ర్శ‌కుడు, తారాగ‌ణం, ఇత‌ర సాంకేతిక బృందం వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్రకటించనున్నారు. నిఖిల్ ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ 2’, ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో “18 పేజెస్”‌లో నటిస్తున్నాడు.

Related posts