సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసే విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కేసులో కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు ఈడీ అధికారులు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ చాట్లో బయటపడిన గోవాకు చెందిన గౌరవ్ ఆర్యాను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఈడీ ఆఫీసుకు గౌరవ్ ఆర్య ఆదివారం చేరుకున్నారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ ఉదయం 11 గంటలకు ఆర్యాని విచారించనున్నారు. ఈడీ విచారణ అనంతరం, సీబీఐ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యాను విచారించనున్నారు. ఇక రియా చక్రవర్తి కూడా సీబీఐ అధికారుల ఎదుట సోమవారం ఉదయం హాజరయ్యారు. సుశాంత్ మృతి కేసుతోపాటు మనీ లాండరింగ్, డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి గౌరవ్కు ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీయనున్నారు. ఇక ముంబైకి బయల్దేరేముందు ఆర్యా మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సుశాంత్తో ఎటువంటి పరియచం లేదని, ఎప్పుడూ అతన్ని చూడలేదని చెప్పాడు. రియాను 2017లో కలుసుకున్నాని వెల్లడించాడు. కాగా, గోవాలోని తమరైండ్ హొటల్ అండ్ కేఫ్ కొటింగాని అతను నిర్వహిస్తున్నాడు.
previous post