సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి, తమన్నా మధ్య భారీ పాటను చిత్రీకరించారట. దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో చిత్రీకరించిన ఆ పాటను చివరి నిమిషంలో పక్కన పెట్టారట. నర్సింహారెడ్డి పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందనే భావనతో ఆ పాటను సినిమాలో ఉంచలేదట. ఆ పాటను త్వరలో సినిమాకు కలపబోతున్నట్టుతెలుస్తోంది. థియేటర్లలో రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ఛానెల్ ఏకంగా రూ.22 కోట్లకు దక్కించుకుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ కూడా డిజిటల్ హక్కుల కోసం భారీగా చెల్లించింది. త్వరలో టీవీలో ప్రసారం కాబోయే `సైరా` చిత్రంలో ఆ భారీ సాంగ్ ఉంటుందట. అలాగే అమెజాన్ ప్రైమ్లోనూ ఆ పాటతో కూడిన `సైరా` చిత్రాన్ని వీక్షించవచ్చట.
previous post
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు