ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం విభజించింది. ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడుకు చెందిన మక్కల్ నీధి మయం పార్టీ నేత కమల్హాసన్ ఖండించారు.
పార్లమెంట్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అది ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఆక్షేపణీయంగా ఉందని, అది నిరంకుశ చర్య అని అన్నారు. ఆర్టికల్ 370, 35ఏలకు ఓ ప్రత్యేకత ఉన్నదని, కానీ మార్పులు చేయాలనుకుంటే, ముందుగా చర్చల ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలని కమల్ అన్నారు.
కరీనా కపూర్, ఆలియా భట్ ఇన్స్టా కామెంట్స్ సెక్షన్ బ్లాక్