telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ డబ్బులు తీసుకుని.. ఓటు మాత్రం బీజేపీకి వేయండి

BJP Bandi sanjay

టీఆర్ఎస్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు బండి సంజయ్. ఇద్దరి పిల్లల నిబంధన తొలగింపు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఉరి తాడుగా మారుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పటానికి కలసి వచ్చే వారందర్నీ కలుపుకుని వెళ్తామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరి పిల్లల నిబంధనలను తొలగించటాన్ని బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. ఇద్దరి పిల్లల నిబంధన తొలగింపే .. టీఆర్ఎస్ కు ఉరి తాడుగా మారుతోందని.. ఆంధ్ర సహా.. ఇతర రాష్ట్రాల సెలిలర్లు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తారని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే దుబ్బాక ఉప ఎన్నికల్లో పునరావృతం అవుతాయని..
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితానికి.. రాబోయే ఎన్నికలకు సంబంధం లేదని ధీమా వ్యక్తం చేసారు. సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల మాదిరి దుబ్బాకను ఎందుకు అభివృద్ధి చేయలేదని.. రాజసింగ్ కు అసెంబ్లీలో… ఉద్యమకారుడు తోడు కాబోతున్నాడని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులు తీసుకుని.. ఓటు మాత్రం బీజేపీకి వేయండని పిలిపించారు. ప్రజాసమస్యలపై గ్రేటర్ లో నా పర్యటన ఉంటోందని..డబుల్ బెడ్రూం ఇళ్ళపైనే జీహెచ్ఎంసీ ఎన్నికలని తెలిపారు.

Related posts