టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోయిన్స్లలో ఖుష్బూ ఒకరు. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఖుష్బూ.. అతి తక్కువ సమయంలో తెలుగులో టాప్ హీరోయిన్గా స్థానం సంపాదించుకుంది.
ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహర్లు అనే సినిమాలో ఖుష్బూ నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఖుష్బూ బరువు ‘‘బరువు తగ్గాలన్న లక్ష్యంతో ఎంతో కష్టపడ్డారు. హార్డ్వర్క్కి తగ్గ ఫలితం కనబడుతోంది .ఈ సందర్భంగా అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎప్పుడైతే కష్టపడతామో.. అప్పుడే ఫలితం కనిపిస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఖుష్బూ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఖుష్బూను ఇలా చూసిన నెటిజన్లు సూపర్, గుడ్ ఎఫర్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్,రష్మిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో ఖుష్బూ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఖుష్బూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత తాజాగా ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.