telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇద్దరు స్టార్ హీరోలకు పార్టీ ఇచ్చిన యంగ్ టైగర్

Jr.ntr actor Ycp photos social media

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. తాజాగా షూటింగ్ గ్యాప్‌లో ఎన్టీయార్ ఇద్దరు స్టార్‌లకు తన ఇంట్లో అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడట. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్. వీరిద్దరూ “కేజీఎఫ్-2” కోసం ఆర్‌ఎఫ్‌సీలోనే షూటింగ్‌లో పాల్గొంటున్నారట. అక్కడే వారిని కలిసిన ఎన్టీయార్ తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడని తెలుస్తోంది. తారక్ పిలవగానే వారిద్దరూ ఆయన ఇంటికి వెళ్లారట. వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సత్కరించాడట. వారి కోసం స్పెషల్ వంటకాలు చేయించాడట. తారక్ ఇచ్చిన పార్టీతో వారిద్దరూ ఫుల్ ఖుషీ అయినట్టు సమాచారం. ఇక టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్రఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. ఈ చిత్రంలో పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసేలా సినిమాను తెరకెక్కిస్తున్నార‌ని టాక్‌. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30, 2020న విడుద‌ల చేయ‌నున్నారు.

Related posts