ఇలయదళపతి విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 63వ సినిమాగా “బిగిల్” అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానున్నట్టు సమాచారం. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. విజయ్ 64వ ప్రాజెక్ట్ విషయంలోను స్పీడ్ పెంచినట్టు తెలుస్తుంది. లోకేష్ కంగరాజ్ దర్శకత్వంలో విజయ్ తన 64వ సినిమా చేస్తుండగా,ఈ చిత్రాన్ని ఎక్స్బీ ఫిలిం క్రియేటర్స్ నిర్మించనున్నారు. అనిరుథ్ రవిచంద్రన్ స్వరకర్త. 2020 సమ్మర్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా చిత్ర కథానాయిక మాళవిక మోహనన్ సెట్స్లోకి అడుగుపెట్టింది. కీలకమైన సన్నివేశాలని హీరో, హీరోయిన్ల మధ్య దర్శకుడు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.