ఢిల్లీలో నలుగురు జైషే ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో భద్రతను పటిష్టం చేశారు. ఉత్తరాదిలో ఉన్న అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు
. ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. నలుగురు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో ఢిల్లీలోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు సమీప పట్టణాల్లో భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ హెచ్చరికల గురించి ఇవాళ ఉదయం ప్రధాని మోదీ నివాసంలో చర్చ జరిగింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలకు హెచ్చరికలు అందాయి. మోదీ, షా, దోవల్కు ఉగ్ర ముప్పు ఉన్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.