telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉత్త‌రాదిలో హై అల‌ర్ట్‌.. విమానాశ్ర‌యాల్లో భారీ భ‌ద్ర‌త‌

kashmir police firing

ఢిల్లీలో న‌లుగురు జైషే ఉగ్ర‌వాదులు చొర‌బ‌డిన‌ట్లు ఇంటెలిజెన్స్ హెచ్చ‌రిక‌లు రావ‌డంతో భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేశారు. ఉత్త‌రాదిలో ఉన్న అన్ని విమానాశ్ర‌యాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు

. ఢిల్లీకి చెందిన స్పెష‌ల్ సెల్ నుంచి హెచ్చ‌రిక‌లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. న‌లుగురు ఉగ్ర‌వాదులు భారీ ఆయుధాల‌తో ఢిల్లీలోకి ప్ర‌వేశించిన‌ట్లు ఇంటెలిజెన్స్ హెచ్చ‌రిక‌లు చేసింది.

ఈ నేప‌థ్యంలో ఢిల్లీతో పాటు స‌మీప ప‌ట్ట‌ణాల్లో భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ హెచ్చ‌రిక‌ల గురించి ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని మోదీ నివాసంలో చ‌ర్చ జ‌రిగింది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు భ‌ద్ర‌తా ద‌ళాల‌కు హెచ్చ‌రిక‌లు అందాయి. మోదీ, షా, దోవ‌ల్‌కు ఉగ్ర ముప్పు ఉన్న‌ట్లు ఇటీవ‌ల ఇంటెలిజెన్స్ హెచ్చ‌రించింది.

Related posts