telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ టీడీపీ నేతలు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై మీడియాతో మాట్లాడిన తెలంగాణ టీడీపీ నేతలు.. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి ఏపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుంది అని.. బాధితుడు ఎకరో తెలియదు.. కానీ, ఓ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారని.. చంద్రబాబును మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ఏపీ సర్కార్ ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రావుల చంద్రశేఖర్ రెడ్డి.. ఇక, అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే లేనిపోని ప్రచారం చేశారు.. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ ఇతర, కారణాలు చూపి.. రాజధానిని తరలించడానికే ప్లాన్ అని ఆరోపించారు. మరోవైపు, ఏపీలో ప్రజాస్వామ్యానికి తూట్లుపొడిచే విధంగా అధికార పక్షం వ్యవహరిస్తోందని.. ఎవరైనా గెలిచిన తర్వాత క్యాంపులు పెడతారు.. కానీ, పోటీ చేసిన అభ్యర్థులతో క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి కల్పించారని విమర్శించారు రావుల.

Related posts