telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రోజా వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం

roja ycp mla

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య చెలరేగిన వివాదం ముదురుతోంది. తనను పిలవకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ నారాయణస్వామిపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోజా వ్యాఖ్యల ఆయన ఘాటుగా స్పందించారు.

పుత్తూరులో పర్యటించేందుకు తనకు రోజా అనుమతి అవసరం లేదని నారాయణస్వామి చెప్పారు. ఆమెకు వ్యతిరేకంగా తాము మీటింగ్ పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల క్రితం గిరిజన యువజన సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. సంఘం తరపున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ ఒక కల్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ తిరుపతికి వెళ్తూ పుత్తూరుకు వచ్చి స్థలాన్ని పరిశీలించారని చెప్పారు.

Related posts