కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని అక్కినేని సమంత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు స్వామి దర్శనం చేయించారు .అయితే గతంలోనూ సమంత చాలా సార్లు తిరుమలకు వచ్చారు.
తనకు తిరుమల అంటే ఎంతో ఇష్టమని, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి గతంలోనూ వచ్చానని… స్వామి వారిని దర్శించుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని సామ్ ఇంతకు ముందు చాలాసార్లు చెప్పారు.
కాగా..సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. అలాగే తమిళ్ లో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఇటీవల నాగ చైతన్య- సమంత విడిపోతున్నారని రూమర్స్ వస్తున్న వేళ స్వామి వారిని సమంత ఒక్కరే దర్శించుకోవడం విశేషం. అయితే తాజాగా ఈ రూమర్స్ కు సామ్ పులిస్టాప్ పడింది.భావిస్తున్నారు. చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా సామ్ ఓ పోస్ట్ పెట్టింది. దాంతో ఆవార్తలకు చెక్ పడిందనే భావిస్తున్నారు.