నిర్భయ ఘటన తర్వాత మళ్ళీ అంత దారుణమైన ఘటన గా ప్రియాంక రెడ్డి హత్యోదంతం యావత్ దేశాన్నే కుదిపేసింది. నేరస్తులని కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పాశవిక అత్యాచారాన్ని ఖండిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు అందరు ఆ దుండగులని జనాల మధ్య ఉరితీసి చంపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు ఓ వీడియో రూపంలో తన బాధని వ్యక్తకరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవిత రూపంలో స్వరాన్ని వినిపించాడు. ఇవి ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది.
ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో.. ఎవరి మాట మన్ననగా ఉంటుందో.. ఎవరి మనసు మెత్తగా ఉంటుందో.. ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో.. ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో..ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో. వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో.. ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో.. స్త్రీకి గుర్తింపు, గౌరవం ఉండాలని ఎవరు అనుకుంటారో.. ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో.. అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడే మగాడు.. అంటూ మహేష్ తన వీడియోలో తెలిపారు.
ట్రంప్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు…