తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న ఇంటర్వ్యూలు యథావిధిగా కొసాగనున్నాయి. గ్రూప్-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఈ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గానే ఉన్నాయని, అందులో జోక్యం అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ సమస్యను ఇంతటితో ముగిద్దామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది. వైట్నర్, రాంగ్ బబ్లింగ్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో గ్రూప్-2 నియామకాల ప్రక్రియను టీఎస్పీఎస్సీ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 1,032 పోస్టులకు గానూ 2,142 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు నిర్వహిస్తోంది.
కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణం: బీహార్ పీసీసీ