వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నారట. తాను అమర్నాథ్లోని మంచు లింగాన్ని దర్శించుకుని వెళ్లిన పది నిమిషాల్లోనే వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. అమర్నాథ్లో మంచు శివ లింగాన్ని దర్శించుకున్నట్లు రాజా సింగ్ తెలిపారు.. పెద్ద శబ్దంతో వరద దూసుకొస్తూ కనిపించిందని, భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారని తాను చూసిన ఆ భయానక దృశ్యం గురించి చెప్పారు.
తమకు కొద్ది దూరంలోనే ఎంతోమంది తన కళ్ల ముందే వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించారని, ప్రాణాలతో బయటపడతామా..? అనే భయం వేసిందని అన్నారు. అదృష్టవశాత్తు సమయానికి గుర్రాలు దొరకడంతో వాటిపై కిందికి బయలుదేరామన్నారు. కిందికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టిందన్నారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం సమకూర్చి తనను, తన కుటుంబాన్ని శ్రీనగర్ చేర్చినట్టు చెప్పారు.
కాగా, శనివారం వైష్ణవీదేవి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నట్లు రాజాసింగ్ తెలిపారు. ఆదివారం ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని సోమవారం తిరిగి హైదరాబాద్కు వస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది భక్తులు అక్కడ మాకు ఎదురయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడం కనిపించింది’’ అని రాజాసింగ్ తెలిపారు.
అమర్నాథ్ యాత్రలో అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి కొండలపై నుంచి వరద పోటెత్తింది. ఈ వరదలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. 45 మంది దాకా గల్లంతైనట్లు సమాచారం.
ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఆర్మీ, ఐటీబీటీ జవాన్లు, పోలీసు బృందాలతో శనివారం తెల్లవారుజాము నుంచే సహాయ చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఆరోగ్యశ్రీని కాపికొట్టి ‘ఆయుష్మాన్ భారత్’: కేసీఆర్