లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో టీమ్ఇండియా ఆటగాళ్ల వేతనాల్లో కోత ఉండొచ్చని మాట్లాడినఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హాత్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. బీసీసీఐకి లాభించేలా మల్హోత్రా ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఆటగాళ్ల వేతనాల్లో కోత గురించి మాట్లాడే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ఆదివారం ప్రశ్నించాడు.
బీసీసీఐకి లాభించేలా మల్హోత్రా మాట్లాడుతున్నాడని అర్థమవుతున్నది. కోత విషయం మాట్లాడే అధికారం అతనికెక్కడిదని ధ్వజమెత్తారు. ప్రస్తుత అంతర్జాతీయ, ఫస్ట్క్లాస్ క్రికెటర్లు.. ఐసీఏలో లేరు. వారి తరఫున అతడు మాట్లాడకూడదు. మీ జేబులకు చిల్లు పడనప్పుడు వేతనాల కోత గురించి మాట్లాడడం సులువేయని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తండ్రీ కొడుకులు శూన్య తెలంగాణ చేస్తున్నారు: వివేక్