కరోనా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలోని పేదలకు రూ. 1000 చొప్పున పంపిణీ చేసిన సంగతి తెలసిందే. దీనిపై ఏపీ బీజేపీ అగ్రనేత కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. పేదలకు ప్రకటించిన వెయ్యి రూపాయల ఆర్థికసాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని తన లేఖలో ఆరోపించారు.
ఆ డబ్బును వైసీపీ పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులపై అనర్హత వేటు వేసి జైలు శిక్ష విధించాలని కోరారు. ఇలాంటి సంక్షోభ సమయంలో స్వార్థ రాజకీయాలు తగవని వైసీపీకి కన్నా హితవు పలికారు. చాలా చోట్ల డబ్బు అందించేందుకు వాలంటీర్లతో కలిసి వైసీపీ నాయకులు తిరుగుతూ ఓట్ల కోసం ప్రయత్నాలు చేయడాన్ని తప్పుపట్టారు.